🎀 *ప్రస్తావ-పారిజాతః-4* 🎁
*ప్రస్తావ పారిజాతం-4 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*--------------------------
🌷
సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
ప్రస్తావవిషయః - భారతదేశః; 🙏
భారతదేశో నామ జ్ఞానే ఆసక్తానాం భూమిః। భా=ప్రకాశః (జ్ఞానేన సాదృశ్యం ప్రకాశస్య), రతః=ఆసక్తః ఇతి। భారతీయతా నామ జ్ఞానతత్పరతా। దేశోఽయం సనాతనధర్మస్య జన్మస్థానమ్। ఋషీణాం మునీనాం తపోభూమిః। వీరాణాం త్యాగభూమిః।
దేవతాః అపి అత్ర లబ్ధజన్మభ్యః ఈర్ష్యన్తే ఇతి కథ్యతే। సుజల-నదీ-వన-పర్వతాది-నిసర్గసౌన్దర్యస్య, తీర్థస్థానానాం, పుణ్యక్షేత్రాణాం, రామాయణమహాభారతాదికృతీనాం కర్తౄణాం చ పవిత్రధరేయం మమ జన్మస్థానమితి అహం గర్వమనుభవామి।
జమ్బూ-ప్లక్ష-శాల్మల-కుశ-క్రౌఞ్చ-శాక-పుష్కరేతి సప్తద్వీపాః సన్తి యే క్రమశః లవణేక్షురస-సురా-ఘృత-దధి-దుగ్ధ-జల-ఇతి సప్తసముద్రైః పరివృతాః। జమ్బూమ్బూద్వీపస్య మధ్యే సువర్ణమయో మేరుపర్వతోఽస్తి। మేరోః దక్షిణే నవసహస్రయోజనమిత-విస్తరితః భారతవర్షోఽస్తి। కర్మభూమావస్యాం సకామసాధకానాం స్వర్గః, నిష్కామసాధాకనాఞ్చ మోక్షప్రాప్తిః చ సమ్భవతః।
అత్ర మహేన్ద్ర-మలయ-సహ్య-శుక్తిమత్-ఋక్ష-విన్ధ్య-పారియాత్రేతి సప్త కులపర్వతాః సన్తి। శతద్రూ-చన్ద్రభాగా-నర్మదా-కావేరీ-గోదావరీ-భీమరథీ-కృష్ణవేణీ-కృతామలా-తామ్రపర్ణీ-త్రిసన్ధ్యర్షికుల్యా-కుమారేత్యాదయః బహవః నద్యః పర్వతేభ్య ఏతేభ్యః నిఃసరన్తి యాసాం నామోచ్చారణేనాపి పాపాని హ్రియన్తే।
కురు-పాఞ్చాల-మధ్యప్రదేశ-పూర్వదేశ-కామరూప-పౌణ్డ్ర-కలిఙ్గ-మగధ-దక్షిణ-సౌరాష్ట్ర-శూద్రాభీరార్బుద-మరు-మాలవా-పారియాత్ర-సౌవీర-సింధ-శాల్వ-శాకల్య-మద్రామ్బష్ఠ-పారసీకాది-ప్రదేశాః సన్తి। ఇతోఽధిక-భారతదేశ-వర్ణనం బ్రహ్మపురాణే అస్తి॥
--ఉషారాణీ సంకా
----------------------------------------
ప్రస్తావ విషయం-భారత దేశము
భారత దేశం అంటే జ్ఞానమునందు ఆసక్తి కలవారి భూమి.
భా అంటే ప్రకాశం (జ్ఞానముతో సమానమైన వెలుగు )రత అంటే ఆసక్తి కలవారు అని.భారతీయత అంటే జ్ఞానాసక్తి.
ఈ దేశము సనాతన ధర్మానికి జన్మభూమి.
ఋషులకు మునులకు తపోభూమి.
వీరులకు త్యాగభూమి.
దేవతలు కూడా ఇక్కడ పుట్టిన వారిమీద ఈర్ష్య చెందుతారని అంటారు.
మంచినీటి నదులు, పర్వతాలు, అడవుల
సహజ సౌందర్యం, తీర్థ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు,రామాయణ మహాభారతాది
కావ్యకర్తలకు పుట్టినిల్లయిన ఈ పవిత్ర భూమి నా జన్మభూమి అయినందుకు నేను గర్విస్తాను.
జమ్బూ-ప్లక్ష-శాల్మల-కుశ-క్రౌఞ్చ-శాక-పుష్కరాలనే సప్తద్వీపాలను వరుసగా లవణ ఇక్షురస-సురా-ఘృత-దధి-క్షిర-జలములనే సప్తసముద్రాల చేత చుట్టబడి ఉంది. జంబూ ద్వీపంలో బంగారు మేరు పర్వతం ఉంది. మేరు పర్వతానికి దక్షిణాన తొమ్మిది వేల యోజనాల విస్తీర్ణం గల భారతవర్షమున్నది. ఈ కర్మభూమి యందు
సకామ సాధకులకు స్వర్గప్రాప్తి, నిష్కామ సాధకులకు మోక్షప్రాప్తి కలుగుతుంది.
ఇక్కడ మహేన్ద్ర-మలయ-సహ్య-శుక్తిమత్-ఋక్ష-విన్ధ్య-పారిత్రయములనే సప్త కులపర్వతాలు కలవు.
పర్వతాలనుండి పుట్టి ప్రవహిస్తున్న శతద్రూ-చన్ద్రభాగా-నర్మదా-కావేరీ-గోదావరీ-భీమరథీ-కృష్ణవేణీ-కృతామలా-తామ్రపర్ణీ-త్రిసన్ధ్య ఋషికుల్యా-కుమారి మొదలైన చాలా నదుల పేర్లను స్మరించినా చాలు పాపాలు నశిస్తాయి.
కురు-పాఞ్చాల-మధ్యప్రదేశ-పూర్వదేశ-కామరూప-పౌణ్డ్ర-కలిఙ్గ-మగధ-దక్షిణ-సౌరాష్ట్ర-శూద్ర -అభీర- అర్బుద-మరు-మాళవ-పారియాత్ర-సౌవీర-సధ-శాల్వ-శాకల్య-మద్రామ్బష్ఠ-పారసీకాది ప్రదేశాలు కలవు. భారతదేశం యొక్కవర్ణనం ఇంకా ఎక్కువగా బ్రహ్మపురాణంలో ఉన్నది.
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
No comments:
Post a Comment