Sunday, September 5, 2021

ప్రస్తావ పారిజాతం-20 విషయం -- చంద్రుడు

🎀 *ప్రస్తావ-పారిజాతః-20* 🎁
*ప్రస్తావ పారిజాతం-20 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌻 ప్రస్తావవిషయః -- చన్ద్రః 🌺

చన్దయతి ఆహ్లాదయతి చన్దతి దీప్యతే ఇతి వా చన్ద్రః। నవగ్రహేష్వన్యతమోఽయం గ్రహః శీతత్వప్రసాదనాహ్లాదజననాదిగుణైః లోకే సుప్రఖ్యాతః। రాత్రౌ రాజా భూత్వా సూర్యాభావే కాన్తిం ప్రసారయతి। ఏషః నక్షత్రాణాం పతిరితి, సున్దరః, నిత్యధవలవస్త్రధారీతి వర్ణితః। శశచిహ్నభృదయం శృఙ్గారరసే ముఖ్యతమః ఉద్దీపనవిభావః విరాజతే। నానాభాషాసు, వివిధప్రదేశేషు చ, ప్రాచీనకాలికైః ఆధునికైశ్చ రచయితృభిః ఏషః వివిధసంయోగవిప్రయోగాదిసన్దర్భేషు నైకేషు స్థలేషు ఉపమానరూపేణ వర్ణితః। సాహిత్యవాఙ్మయే, శాస్త్రీయే చ, నానావిధనృత్యగీతాదిషు కలాసు, జ్యోతిఃశాస్త్రేఽపి స్వర్లోకదేవానామన్యతమస్యాస్య మహాన్ ఉల్లేఖో వర్తతే। చన్ద్రకాన్తిః పూర్ణిమాయామతిశయేన ప్రతిభాతి, అమావాస్యాం చ నితరాం క్షీణా భవతి। పార్వతీపతేః జటాజూటే అలఙ్కృతస్యాస్య షోడశకలాః సన్తి। ప్రతిపదా-ద్వితీయేత్యారభ్య పౌర్ణమీపర్యన్తమేకః పఞ్చదశదివసీయః పక్షః, పునః తస్మిన్నేవ క్రమే అమావాస్యాన్తః అపరః పక్షః చ భవతః। పురాణేషు మనఃకారకమిమమధికృత్య నైకాః కథాః ఉపవర్ణితాః సన్తి। ఉత్పలానామానన్దకారకమిమం దర్శయిత్వా మాతరః శిశూన్ అన్నం ఖాదయన్తి స్మ। యన్త్రాదిభిః పరివృతాః సామ్ప్రతికాః చన్ద్రదర్శనసౌఖ్యం, ఆహ్లాదభావం చ విస్మృతవన్తః దృశ్యన్తే॥

--సంకా ఉషారాణి
-----------------------------------------------
ప్రస్తావవిషయం- చంద్రుడు

సంతోషపెట్టును లేక ఆహ్లాదము కలిగించును, వెలుగునిచ్చును కనుక చంద్రుడు. నవగ్రహాలలో ఒకటి ఈ గ్రహం. చల్లదనము, ప్రసన్నత, ఆహ్లాదము కలిగించే గుణముల చేత లోకంలో బహు ప్రఖ్యాతుడు. రాత్రిలందు రాజుగా సూర్యుడి పరోక్షంలో వెలుగును ప్రసరింప జేస్తాడు. ఈతడు నక్షత్రాలకు పతి అని,సుందరుడు, నిత్యము తెల్లని వస్త్రాలను ధరిస్తాడని వర్ణింపబడినాడు. కుందేలు చిహ్నాన్ని ధరించే ఈతడు శృంగార రసమందు ముఖ్యమైన ఉద్దీపన విభావంగా వెలుగుతాడు. అనేక భాషలలో, వివిధ ప్రదేశాలలోనూ ప్రాచీనకాలికులైన రచయితల చేతనూ ,ఆధునిక రచయితలచేతనూ ఈతడు వివిధ సంయోగ వియోగ సందర్భాలలో, ఎన్నో చోట్ల ఉపమానంగా వర్ణించబడినాడు. సాహిత్య వాజ్ఞ్మయములో,శాస్త్రములందున్నూ, నానావిధ నృత్యగీతాది కళలలో , జ్యోతిశ్శాస్త్రంలో కూడా, స్వర్గలోక దేవతలలో ఒకడైన ఈతని గురించి గొప్పగా వ్రాయబడింది.
చంద్రకాంతి పౌర్ణమినాడు చాలా గొప్పగా ఉంటుంది. అమావాస్య నాడు పూర్తిగా క్షీణించి ఉంటుంది. పార్వతీపతి జటాజూటంలో అలంకరింపబడే ఇతనికి పదహారు కళలు ఉంటవి.
పాడ్యమీ,విదియ నుండి ఆరంభమై పౌర్ణమి వరకు పదిహేను దినముల పక్షము, మళ్ళీ అదే క్రమంలో అమావాస్యతో అంతమయ్యే రెండవ పక్షమున్నూ ఉంటుంది. పురాణములలో మనసుకు కారకుడైన ఈతని గురించి అనేక కథలు వర్ణించబడి ఉన్నవి. కలువలకు ఆనందకారకుడైన ఈతనిని చూపిస్తూ తల్లులు పిల్లలకు అన్నం తినిపిస్తారు. యాంత్రిక జీవితంలో ఉన్న నేటివారు చంద్ర దర్శన సుఖమును, ఆహ్లాదభావమునూ మరచి పోయినట్లు అనిపిస్తున్నది.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు


ప్రస్తావ పారిజాతం-19 విషయం -- భాష

🎀 ప్రస్తావ-పారిజాతః-19 🎁
ప్రస్తావ పారిజాతం-19 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)
--------------------------
🌷
రచన-
సంస్కృతం -సంకా ఉషారాణి
తెలుగు- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸
🌻ప్రస్తావవిషయః -- భాషా 🌺

    భాష్యతే శాస్త్రవ్యవహారాదినా ప్రయుజ్యతే ఇతి భాషా। భాషా ఏవ మానవస్య పశోః చ మధ్యే భేదకః విషయః వర్తతే। పురుషాణాం పరస్పరం సఁల్లాపాయ, హృద్గతభావానాం జ్ఞాపనాయ, సమ్భాషణాయ, జ్ఞానాదాన-ప్రదానాయ చ భాషోపయుజ్యతే। భాషా లిఖితరూపా, వచనరూపా చేతి ద్వివిధా। లిఖితరూపా పఠ్యతే, ఉక్తరూపా చ శ్రూయతే। ఉక్తరూపాయాః శ్రవణేన వచనశక్తిర్వర్ధతే, లిఖితరూపాయాః పఠనేన లేఖనశక్తిశ్చ। భాషావ్యవహారేణైవ మనుష్యాణాం అన్తఃప్రకృతిః జ్ఞాయతే। భాషయా కస్యచిత్ పురుషస్య ప్రదేశః, సామాజికస్తరః, విద్యావత్త్వం, జాతిరిత్యాదయః జ్ఞాయన్తే। రూపపరివర్తనేన మానవః అన్యాన్ వఞ్చితుం శక్నోతి। పరన్తు భాషయా న కదాపి తథా కర్తుం పారయతి। బాలః జ్యేష్ఠాన్ దృష్ట్వా, వ్యవహారం పశ్యన్ భాషాం క్రమేణ గృహ్ణాతి। లోకేఽస్మిన్ వివిధాః భాషాః సన్తి। సంస్కృతం, ప్రాకృతమిత్యాదిభాషాః ప్రాచీనాః। తేలుగు-మరాఠీ-తమిలాదిభాషేత్యాదయః ఆధునికాః॥

--సంకా ఉషారాణి
-----------------------------------------------

ప్రస్తావవిషయం-భాష

మాట్లాడేది,శాస్త్ర వ్యవహారాలు మొదలైన వాటిలో ప్రయోగింపబడేది భాష. భాషయే మనుష్యులు పశువుల మధ్య వ్యత్యాసాన్ని తెలిపేది.పురుషుల మధ్య పరస్పర సల్లాపాలు, మనసులో భావాలు పంచుకోవడానికి, సంభాషించడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి కూడా భాషను ఉపయోగించబడుతుంది.
భాష వ్రాత రూపంలోనూ,మాటగానూ రెండు విధాలు. వ్రాత రూపంలో చదువ బడుతుంది. మాట వినబడుతుంది. మాటలను వినటం వలన వినికిడి శక్తి పెరుగుతుంది. వ్రాత రూపంలో చదవటం వలన వ్రాసే శక్తి పెరుగుతుంది. భాషా వ్యవహారం వలననే మనుషుల స్వభావం తెలుస్తుంది. భాష వలన ఒకానొక పురుషుడి దేశం, సామాజిక స్థాయి, విద్వత్తు, జాతి మొదలైనవి తెలుస్తాయి. రూపం మార్చుకుని మనిషి ఇతరులను మోసగించగలడు. కానీ భాషతో ఎప్పుడూ అలా చేయటం కుదరదు. పిల్లలు పెద్దవాళ్ళను, వాళ్ళ ప్రవర్తనను చూసి భాషను క్రమంగా గ్రహిస్తారు. లోకంలో అనేక భాషలున్నాయి. సంస్కృతము, ప్రాకృతము ఇత్యాది భాషలు ప్రాచీనమైనవి.తెలుగు-
మరాఠీ-తమిళం మొదలైన భాషలు ఆధునికాలు.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం-18 విషయం -- గురువు

🎀 *ప్రస్తావ-పారిజాతః-18* 🎁
*ప్రస్తావ పారిజాతం-18 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌻 ప్రస్తావవిషయః -- గురుః 🌺

గృణాతి ఉపదిశతి వేదాదిశాస్త్రాణి ఇన్ద్రాది-దేవేభ్యః ఇతి, యద్వా గీర్యతే స్తూయతే దేవ-గన్ధర్వమనుష్యాదిభిః ఇతి గురుః। సత్సు గురుశబ్దేనాభిహితేషు బహుష్వపి ప్రాయః సామాన్యతయా గురుశబ్దేన జ్ఞానప్రదాతా ఆచార్య ఏవ మనసి స్ఫురతి। దేవేభ్యోఽప్యతిరిచ్య యః తిష్ఠతి, భువౌ సన్మార్గదర్శనేన నరముత్తమలోకాన్ ప్రాపయతి యః, సః గురుః బ్రహ్మావిష్ణుమహేశ్వరతుల్య ఇతి గురుగీతాయాముచ్యతే। గురుపరమ్పరాయాం స్థిత్వా సచ్చిదానన్దచిన్తనే నిరన్తరం మగ్నం గురుం సముపగమ్య జ్ఞానగ్రహణేన యః జనః స్వజన్మ సార్థకం కరోతి, సః పునః సంసారసాగరే న పతతి। గురుసేవయా మహాపుణ్యం ప్రాప్యతే। సనాతనధర్మగ్రన్థాః సర్వే గురోః మహిమానం వర్ణయన్తి। సద్గురుసన్నిధిః కోటిజన్మనాం పుణ్యేనైవ లభ్యతే। భగవాన్ బాదరాయణః, శఙ్కరాచార్యః ఇత్యాదయః బహవః ఆచార్యః సద్గురవః సన్తః సముల్లసన్తి భారతభూమౌ। న గురోరధికం తత్త్వం, న గురోరధికం తపః- ఇతి ఉక్తిః సత్యమేవ భాతి। యేషాం గురుః నాస్తి, తే భగవన్తమేవ గురురితి మత్వా పూజయన్తి। స్వప్నేపి కదాపి వినోదాయాపి గురునిన్దా న కర్తవ్యా। యత్ర గురోః నిన్దనం భవతి తతః ఝటితి బహిః గన్తవ్యమ్। కదాపి గురోః అవమాననం న కర్తవ్యమ్। గురౌ కుప్యతి దేవోఽపి న రక్షతి। వన్దే గురుపరమ్పరామ్॥

-సంకా ఉషారాణి
-----------------------------------------------
ప్రస్తావవిషయం -- గురువు
ఇంద్రాది దేవతలకు ఉపదేశం చేయువాడు, వేదాది శాస్త్రాలను ఉపదేశించేవాడు లేక దేవ గంధర్వమనుష్యాదుల చేత కీర్తింపబడేవాడు, స్తుతింపబడేవాడు గురువు. గురువు అనే మాట చేత పిలువబడే వాళ్ళు చాలామంది ఉన్నా సామాన్యంగా గురువు అనే శబ్దం చేత జ్ఞానప్రదాత అయిన ఆచార్యుడే మనసులో స్ఫురిస్తాడు.
దేవతలకన్నా పైన ఎవరు ఉంటారో, భూమిపైన మంచి మార్గాన్ని చూపించటం వల్ల
మనుష్యులకు ఉత్తమ లోకాలను కలిగిస్తాడో, ఆ గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమైనవాడు అని గురుగీతలో చెప్పబడింది.
గురు పరంపరలో ఉంటూ సచ్చిదానంద చింతనలో నిరంతరం మునిగి ఉండే గురువును సమీపించి జ్ఞాన సముపార్జనతో ఎవరు తమ జన్మను సార్థకం చేసుకుంటారో ,వారు మళ్ళీ సంసార సాగరంలో పడరు.
గురు శుశ్రూష వలన మహా పుణ్యం కలుగుతుంది. సనాతన ధర్మ గ్రంథాలన్నీ గురువు యొక్క మహిమను వర్ణిస్తాయి. సద్గురువు సన్నిధి కోటి జన్మల పుణ్య వలననే లభిస్తుంది. భగవంతుడైన బాదరాయణుడు(వేదవ్యాసుడు) శంకరాచార్యులవారు మొదలైన చాలామంది ఆచార్యులు, సద్గురువులు, సన్తులు భారతభూమియందు పుట్టారు.
గురువును మించిన తత్త్వం లేదు, గురువును మించిన తపస్సు లేదు, అనే మాట సత్యమనిపిస్తుంది. ఎవరికి గురువు లేడో వారు భగవంతుడినే గురువని తలచి పూజిస్తారు. కలలోకూడా ఎప్పుడూ వినోదానికి కూడా గురునింద చేయకూడదు. ఎక్కడ గురునింద జరుగుతూ ఉంటుందో, అక్కడ నుండి వెంటనే బయటకు వెళ్లిపోవాలి. ఎప్పుడూ గురువును అవమానించకూడదు. గురువు కోపిస్తే దేవతలు కూడా రక్షింపలేరు.
గురు పరంపరకు వందనం.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం-17 విషయం -- వివేకానందుడు

 🎀 *ప్రస్తావ-పారిజాతః-17* 🎁
*ప్రస్తావ పారిజాతం-17 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌻ప్రస్తావవిషయః -- వివేకానన్దః; 🌺
సనాతనధర్మప్రచారకేషు, భారతీయతాయాః ప్రసారకేషు దేశవిదేశేషు విఖ్యాతం నామ వివేకానన్దస్య। అయం పురుషసింహః రామకృష్ణపరమహంసమ్ ఉపగమ్య, భగవద్దర్శనప్రాప్త్యా తుష్టః సన్ తస్య శిష్యత్వం స్వీకృతవాన్। బాల్యే నరేన్ద్రనామ్నా అభిహితోఽయం ఆగామినికాలే వివేకానన్ద ఇతి అఖిలవిశ్వస్మిన్ ప్రసిద్ధో జాతః। సాధుపుఙ్గవోఽయం వేదాన్తదర్శనస్య, యోగ-భక్తి-కర్మాదిమార్గాణాం చ సుష్టు వ్యాఖ్యానం కృతవాన్। అస్య ప్రవచనైః యువజనానాం హృదయాని అద్యాపి ఉల్లాసేన, ఉత్సాహేన చ పరిపుష్టాని భవన్తి। యే నిఃస్పృహయా, నిరీహతయా చ దుఃఖభాజనాని భూత్వా మనఃపీడామనుభవన్తి, తేఽపి అస్య వాణీం శ్రుత్వా పునః నూతనోత్తేజసా సమ్పన్నాః భూత్వా జీవనసమరాఙ్గణాయ సన్నద్ధాః భవన్తి। దేశసేవాయై, ధర్మసేవాయై చాయం మహాత్మా అవివాహితః అతిష్ఠత్। అన్నపానాదిరహితః, రోగాదినా పీడితోఽపి క్లేశాన్ సహమానః అనేకాన్ త్యాగాన్ కృతవాన్। అస్య శిష్యాః, అనుగామినశ్చ బహుషు దేశేషు సన్తి। అయమేవ రామకృష్ణామిశన్-ఇతి గురోః నామ్నా సంస్థామేకామారబ్ధవాన్। యుగపురుషస్యాస్య మహాత్మనః వివేకానన్దస్యోక్తీః, ప్రవచనాని చ అనేకపుస్తకేషు ప్రకాశితాః సన్తి। అస్య జీవనకథామధికృత్య కావ్యాన్యపి రచితాని॥

-సంకా ఉషారాణి
-----------------------------------------------
ప్రస్తావ విషయం- వివేకానందుడు

సనాతన ధర్మ ప్రచారకులలో దేశవిదేశాలలో విఖ్యాతమైన పేరు వివేకానందునిది. ఈ పురుషసింహుడు రామకృష్ణుని దగ్గరకు వెళ్లి భగవంతుని దర్శనం కలగటంతో సంతుష్టుడై ఆయన శిష్యరికాన్ని స్వీకరించాడు. బాల్యంలో నరేంద్రుడనే పేరుగలిగి తరువాత కాలంలో వివేకానందుడనే పేర అఖిల విశ్వంలో ప్రసిధ్ధుడైనాడు. సాధుపుంగవుడైన ఈయన వేదాంతదర్శనమును, యోగ-భక్తి-కర్మాది మార్గాలకు చక్కని వ్యాఖ్యానం చేశాడు. ఈయన ప్రవచనాలచేత యువత హృదయాలు ఈనాటికీ ఉల్లాసంతో ఉత్సాహంతో పరిపుష్టమౌతవి.ఎవరు నిస్పృహతో, కోరికలు లేకుండానూ, దుఃఖభాజనులై మనసులో బాధపడుతూ ఉంటరో వారు సైతం ఈయన మాటలను విని మళ్ళీ క్రొత్త ఉత్సాహంతో కూడి జీవన యుద్ధరంగంలో సన్నద్ధంగా ఉంటారు. దేశసేవ,ధర్మ సేవ కొరకు ఈ మహాత్ముడు అవివాహితుడుగా ఉన్నాడు. అన్నపానాలు లేకుండా,రోగాదులతో పీడించబడి, బాధలను సహిస్తూ ఎన్నో త్యాగాలు చేశాడు. ఈయన శిష్యులు, అనుయాయులు అనేక దేశాలలో ఉన్నారు. ఈయనే రామకృష్ణ మిషన్ అని గురువు పేర సంస్థనొక దానిని ఆరంభించారు. యుగపురుషుడైన ఈ మహాత్ముడు వివేకానందని ఉక్తులు, ప్రవచనాలూ అనేక పుస్తకాలలో ప్రకటించబడిఉన్నవి. ఈయన జీవిత కథను గురించి కావ్యాలు కూడా రచింపబడినాయి.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం-16 విషయం -- పుష్పాణి-పువ్వులు

 🎀 *ప్రస్తావ-పారిజాతః-16* 🎁
*ప్రస్తావ పారిజాతం-16 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌻 ప్రస్తావవిషయః -- పుష్పాణి ⚜
    పుష్ప్యతి వికసతి యత్ తత్ పుష్పమ్। పుష్పమస్యాం సృష్టౌ సమస్తవస్తుషు సర్వసున్దరం, సుకోమలం చ వస్తుజాతమ్। అస్య రచనేన విధాతా సాక్షాద్ ఆనన్దస్య రూపకల్పనం కృతవానివ భాతి। పుష్పదర్శనేన సర్వే మానవాః ప్రాయః తుష్యన్తి। తాని నానావర్ణకాని, విభిన్నరూపాకృతికాని, వివిధప్రకారకసుగన్ధయుక్తాని చ భవన్తి। భ్రమరాణాం జీవభూతాని తరుప్రజాతాని మృదూనీమాని వస్తూని ప్రసూన-కుసుమ-సుమ-ఇత్యాదినామభిః అభిధీయన్తే। ఏషాం దర్శనేన, స్పర్శనేన వా మానసోల్లాసో జాయతే। దేవానాం షోడశోపచారపూజనే, నిత్యపూజాయామ్, అతిథిసేవాయాం, మహాపురుషాణాం సాధుసజ్జనానాం చార్చన-పూజనాదిషు పుష్పాణాం ముఖ్యం కార్యం వర్తతే। అలఙ్కరణాయ, ప్రకోష్ఠేషు, వివాహాదిషు పుష్పాణి ఉపయుజ్యన్తే। పుష్పప్రదానేన బాలాః, యువతయః, మాతరః సర్వాః చ తుష్యన్తి। స్వాగత-సత్కారాది-కార్యక్రమేషు, సభాసు గోష్ఠీషు చ పురుషస్య గౌరవసమ్పాదనాయ పుష్పగుచ్ఛాః అనుదీయన్తే। కవిభిః వర్ణనపరైః చ సౌన్దర్యవర్ణనం ప్రాయః పుష్పానాముపమానేనైవ క్రియతే। పుష్పైః వినా సృష్టిరియం వర్ణవిహీనా అభవిష్యత్।
అహింసా ప్రథమం పుష్పం పుష్పమిన్ద్రియనిగ్రహః।
సర్వపుష్పం దయా భూతే పుష్పం శాన్తిర్విశిష్యతే।
శమః పుష్పం తపః పుష్పం ధ్యానం పుష్పం చ సప్తమమ్।
సత్యం చైవాష్టమం పుష్పమేతైస్తుష్యతి కేశవః॥

-సంకా ఉషారాణి
-----------------------------------------------
 ప్రస్తావ విషయం-- పుష్పములు

పుష్పించి వికసించేది ఏదో అది పుష్పము.పుష్పము ఈ సృష్టిలో అన్ని వస్తువులలోనూ సర్వ సుందరము,అతి కోమలమూ అయిన వస్తువు. దీని యొక్క సృష్టి చేయటం వల్ల విధాత సాక్షాత్తు ఆనందము యొక్క రూపకల్పన చేసినట్లు అనిపిస్తుంది. పుష్ప దర్శనం వలన మానవులందరూ సంతోషిస్తారు. అవి నానా వర్ణాలతో, విభిన్న రూపాలలో,ఆకారాలతో, రకరకాల సవాసనలతో ఉంటాయి. తుమ్మెలకు జీవాధారములైనవి తరువులకు పూచేవి మృదువైనవి అయిన ఈ వస్తువులు ప్రసూనములు, కుసుమములు,సుమములు మొదలైన పేర్లతో పిలువబడతాయి. వీటిని చూడటం వలన,తాకటం వలన మనస్సుకు ఉల్లాసం కలుగుతుంది. దేవతల షోడశోపచార పూజలలో, నిత్య ఫపూజలలో,అతిథి సేవలయందు, మహాపురుషులు, సాధు సజ్జనులు యొక్క అర్చన పూజనాదులలో ముఖ్యమైనవిగా ఉంటాయి.
గదులలో అలంకరణకు, వివాహాలలో పూలను ఉపయోగిస్తారు. పుష్పాలను ఇవ్వటం వలన బాలురు, యువతులు, తల్లులు అందరూ సంతోషిస్తారు. స్వాగత సత్కారాలు మొదలైన కార్యక్రమాలలో, సభలూ గోష్ఠులలో పురుషుల గౌరవించటం కోసం పుష్పగుచ్ఛాలను ఇస్తారు.వర్ణించేవారైన
కవుల చేత కూడా సౌందర్య వర్ణన పుష్పములను ఉపమానముగానే చేయబడుతుంది. పువ్వులు లేకుండా ఈ సృష్టి వర్ణవిహీనం అయిఉండేది.
అహింసా ప్రథమ పుష్పం
పుష్పమిన్ద్రియ నిగ్రహః సర్వ పుష్పం దయా భూతే
పుష్పం శాంన్తిర్విషిష్యతే!
శమం పుష్పం తపః పుష్పం ధ్యానం పుష్పంచ సప్తమమ్!
సత్యంచైవాష్టమం పుష్పమేతైస్తుష్రతి కేశవః!!

 మానవులు దైవానికి అర్పించవలసిన ప్రత్యేక మైన పుష్పాలను శాస్త్రం ఈ విధంగా చెప్పింది.
మొదటి పుష్పం అహింస
ఇంకొక పుష్పం ఇన్ధ్రియ నిగ్రహం . దయ, శాంతి,శమము, తపస్సు ఇంకా ఏడవ పుష్పము ధ్యానం. సత్యము ఎనిమిదవ పుష్పము, వీటి వలన కేశవుడు సంతోషిస్తాడు.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు


ప్రస్తావ పారిజాతం- 15 విషయం -- పాఠశాల

 🎀 ప్రస్తావ-పారిజాతః- 15 🎁
ప్రస్తావ పారిజాతం- 15 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸

🌻 ప్రస్తావవిషయః -- పాఠశాలా; 🌺
    పాఠశాలా నామ యత్ర విద్యాం శిక్షాం చ ప్రాప్నుమః తత్ స్థానమ్। యః కశ్చన సౌధః, యత్కిఞ్చిత్ నిర్మాణం వా పాఠశాలా న భవితుమర్హతి। యత్ర విద్యార్థినః కృతే భావిజీవనాయోపయోగి సర్వమావశ్యకం వస్తువిజ్ఞానం ప్రదీయతే, యత్ర శిక్షకాః విజ్ఞానే రతాః బోధనే ఆసక్తాః విద్యన్తే, పఠనపాఠనాదిభ్యః ఉపయుక్తః వస్తుసామగ్రీ వర్తతే, సుష్ఠు అనుశాసనం, సాధురూపేణ సర్వా చ వ్యవస్థా భవతి సైవ పాఠశాలేతి కథితుం శక్యతే। విద్యార్థినః పఠనమ్, అధ్యాపకాః పాఠనమ్, అన్యే ప్రాశాసానిక-కర్మచారిణః నిర్వహణం, సేవకాః మార్జనాదికర్మ- ఇత్యేవం రీత్యా సర్వే జనాః పాఠశాలాయాం స్వస్వకర్మాణి ఆచరన్తి। పాఠశాలా ప్రతిదినం ప్రాతఃకాలే సునిశ్చితసమయే ఘణ్టానాదేన ఆరభ్యతే। తతః సభాప్రాఙ్గణే ప్రార్థనా, సమాచారపఠనం చ భవతి। అథ సర్వే బాలబాలికాః స్వస్వకక్ష్యాః ప్రవిశన్తి। తత్ర నిర్దిష్టస్థలేషు ఉపవిశ్య ప్రత్యేకం విషయమనుసృత్య ప్రాయః ఏకహోరామితకాలం వా పాదోనఘణ్టామితకాలం వా అధ్యాపకైః పాఠితాన్ పాఠాన్ పఠన్తి। అధ్యాపకాః నీతిబోధనం, సమాజశిక్షాం, గణితం, భాషాశిక్షణం, విజ్ఞానం చ బోధయన్తి। మధ్యే అర్ధఘణ్టామితకాలః భోజనవిరామః భవతి। కదాచిత్ అధ్యాపకస్యానుపస్థితౌ బాలాః క్రీడాఙ్గణే ఖేలన్తి। క్వచిచ్చ గీతనృత్యాదిశిక్షణమపి దీయతే। ప్రతివర్షం వార్షికోత్సవమపి పాఠశాలాయాం నిర్వహన్తి। కదాచిత్ విద్యార్థినః కుత్రచిత్ పర్యటనాయాపి నయన్తి। ఏవం బాల్యకాలే పాఠశాలాయాః ప్రాముఖ్యం మహద్భవతి॥

-సంకా ఉషారాణి
-----------------------------------------------
ప్రస్తావ విషయం--పాఠశాల

పాఠశాల అంటే ఎక్కడ విద్య,శిక్షణ పొందుతామో ఆ స్థానం. ఏదో ఒక భవనము ఏదో ఒక కట్టడము కానీ పాఠశాల కావడానికి అర్హతకలిగినది కాదు. ఎక్కడ విద్యార్థుల కోసం భావిజీవితానికి ఉపయోగించే అవసరమైన సకల వస్తు విజ్ఞానం ప్రసాదించబడుతుందో, ఎక్కడ శిక్షకులు విజ్ఞాన మంటే ఇష్టంతో బోధించడానికి ఆసక్తి కలిగి ఉంటారో, చదవడానికి చదివించడానికి ఉపయోగపడే వస్తు సామగ్రి ఉంటుందో, చక్కని క్రమశిక్షణ,చక్కగా సకల వ్యవస్థ ఉంటుందో అదే పాఠశాల అనబడుతుంది.
విద్యార్థులు చదవటమూ ఉపాధ్యాయులు చదివించటమూ, ఇతరులు అనుశాసకులూ, పనివారి నిర్వహణ, సేవకులు తుడుచుట మొదలైన పనులు, ఇటువంటి రీతులలో సకల జనులూ పాఠశాలలో వారి వారి పనులను చేస్తూంటారు.
పాఠశాల ప్రతిరోజూ ఉదయం నియమిత సమయాన గంట మ్రోగటంతో ప్రారంభమౌతుంది. తరువాత సభా ప్రాంగణంలో ప్రార్థన, సమాచార పఠనమూ ఉంటుంది. అటు తరువాత బాలబాలికలందరూ వారి వారి తరగతి గదులలో ప్రవేశిస్తారు. అక్కడ నిర్దిష్ట స్థలాలలో కూర్చుని ఒక్కొక్క విషయాన్ని దాదాపు ఒక గంట సమయం వరకు లేదా ముప్పావు గంట వరకు అధ్యాపకుల చేత చదివించబడే పాఠాలను చదువుతారు. అధ్యాపకులు నీతిబోధ, సమాజ శిక్ష, గణితము, భాషా బోధన, విజ్ఞానాన్ని( విజ్ఞానవిషయాలను) కూడా బోధిస్తారు. మధ్యలో ఒక అరగంట సమయం భోజనం విరామం ఉంటుంది.ఎప్పుడైనా అధ్యాపకుల పర్యవేక్షణలో బాలురు ఆటస్థలంలో ఆడుకుంటారు. కొన్ని చోట్ల సంగీత నృత్యాదులలో కూడా శిక్షణ ఇవ్వబడుతుంది.ప్రతి సంవత్సరం పాఠశాలలో వార్షికోత్సవం కూడా జరుపుతారు. ఎప్పుడైనా విద్యార్థులను ఎక్కడికైనా పర్యయటనానిని తీసుకొని పోతారు.ఇలా బాల్యంలో పాఠశాల ప్రాముఖ్యం గొప్పగా ఉంటుంది.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం- 14 విషయం -- జనకః-తండ్రి

🎀 *ప్రస్తావ-పారిజాతః- 14* 🎁
*ప్రస్తావ పారిజాతం- 14 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)*
--------------------------
🌷

సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸
🌻 ప్రస్తావవిషయః -- జనకః 💥
జనయతీతి జనకః। పితా జన్మప్రభృతి సన్తానస్య సంరక్షకః, పరిపోషకశ్చ భవతి। సః పుత్రాదీనాం శరీరపోషణాయ, ఆవాసాదికల్పనాయ ధనమర్జతి। బాలకస్య గురుతుల్యః సః। బాల్యే గురుకులగమనాత్ పూర్వం విద్యాం బోధయతి। తస్య మనసి పుత్రాయ సహజం ప్రేమ ఉపజాయతే। స్వక్లేశమవిగణయ్య సః నానావిధపీడాభ్యః బాలం రక్షతి। పితుః సంరక్షణే స్థితః బాలః ఆత్మానం సమస్తజగతి సమ్పద్వాన్, బలవాన్, శక్తిశాలీ చ మన్యతే। మాతా పితా చ జగతీతలే భగవత్సమానౌ। పితృతుల్యాః జనాః అన్యే చత్వారః జనాః సన్తీతి శ్లోకేఽస్మిన్ ఉక్తమ్।
జనితా చోపనేతా చ యశ్చ విద్యాం ప్రయచ్ఛతి ।
అన్నదాతా భయత్రాతా పఞ్చైతే పితరః స్మృతాః ॥
కదాచిత్ కశ్చిత్ పితా పుత్రప్రేమ్ణి అన్ధ ఇవాచరతి। తేన న కేవలం లోకాయ అహితం, అపి తు బాలకస్య చరిత్రమపి వినశ్యతి। అన్ధం పుత్రవాత్సల్యమతిక్రమ్య పిత్రా పుత్రాయ ధర్మాధర్మవిజ్ఞానం బోధ్యమ్। కర్తవ్యాకర్తవ్యవివేచనఞ్చ ప్రబోద్ధవ్యమ్॥

-సంకా ఉషారాణి
-----------------------------------------------
ప్రస్తావ విషయం-- జనకుడు

జన్మనిచ్చువాడు జనకుడు. తండ్రి పుట్టిన నాటి నుండి సంతానము యొక్క సంరక్షకునిగా పోషకునిగానూ ఉంటాడు.
అతడు పుత్రాదుల శరీర పోషణకొరకు,నివాసము కొరకు ధనాన్ని సంపాదిస్తాడు. బాలకునికి గురుసమానుడతడు. బాల్యంలో గురుకులానికి వెళ్ళటానికి ముందు చదువు చెప్తాడు.అతని మనసులో సహజంగానే పుత్రుడిమీద ప్రేమ పుడుతుంది. తన బాధలను లెక్కచెయ్యకుండా అతడు నానా పీడలనుండి బాలుణ్ణి రక్షిస్తాడు.తండ్రి సంరక్షణలో ఉన్న బాలుడు తనను తాను సమస్త ప్రపంచంలో సంపదకలిగిన వానిగా,బలవంతునిగా,శక్తిశాలిగా తలుస్తాడు. తల్లిదండ్రులు ధరాతలంలో భగవత్సమానులు.
పితృతుల్యులైన వారు ఇతరులు నలుగురు ఉంటారని శ్లోకంలో చెప్పబడింది.

జనితా చోపనేతా చ యశ్చ విద్యాం ప్రయచ్ఛతి ।
అన్నదాతా భయత్రాతా పఞ్చైతే పితరః స్మృతాః।।
జన్మనిచ్చిన తండ్రి, ఉపనయనము చేసినవాడు, విద్యనేర్పిన వాడు, అన్నం పెట్టిన వాడూ, భయం నుండి రక్షించిన వాడూ ఈ అయిదుగురు తండ్రులని అంటారు.
ఒక్కొక్కసారి ఒకానొక తండ్రి పుత్రప్రేమతో గుడ్డివాడిలా ప్రవర్తిస్తాడు. అతని వలన లోకానికి హాని కలగటమే కాక, బాలుని జీవితం కూడా నాశనమవుతుంది. గుడ్డి ప్రేమలో పడకుండా తండ్రులచేత పుత్రులకొరకు ధర్మాధర్మ విజ్ఞానం బోధింపబడాలి. చేయదగినది, చేయదగనిది అనే వివేచన కూడా బోధింపబడాలి.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

ప్రస్తావ పారిజాతం-20 విషయం -- చంద్రుడు

🎀 *ప్రస్తావ-పారిజాతః-20* 🎁 *ప్రస్తావ పారిజాతం-20 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)* -------------------------- 🌷 సంస్కృతరచన- సంకా ఉషారాణి తెల...