🎀 ప్రస్తావ-పారిజాతః- 12 🎁
ప్రస్తావ పారిజాతం- 12 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)
--------------------------
🌷
సంస్కృతరచన- సంకా ఉషారాణి
తెలుగు అనువాదం- పులిపాక వేంకట లక్ష్మీకాంత రావు
🌸
🌻 ప్రస్తావవిషయః -- మానవశరీరమ్ 🌼
మనుష్యః పృథివ్యాం సృష్టేషు సమస్తప్రాణిషు విశిష్టః। సః నైకేషు అంశేషు అన్యజన్తూన్ అతిరిచ్య వరీవర్తి। తస్య శరీరనిర్మాణమత్ర ప్రధానకారణమ్। మానవశరీరం స్థూలసూక్ష్మకారణేతి భేదేన త్రివిధమస్తి। స్థూలశరీరం శిరో-నేత్ర-కరచరణాదిభిః అవయవైః సహితం చక్షుర్గోచరమస్తి। తత్ స్ప్రష్టుమపి శక్నుమః। తస్య పోషణం అన్నేన, జలేన, దుగ్ధేన, ఫలాహారాదినా చ భవతి। కిన్తు సూక్ష్మకారణశరీరే న తథా। సూక్ష్మశరీరం నామ, పఞ్చకర్మేన్ద్రియైః, పఞ్చజ్ఞానేన్ద్రియైః, మనోబుద్ధ్యాది-అన్తఃకరణచతుష్టయేన చ సంయుక్తం రూపమ్। మనసః పోషణం చ ధ్యానాదినా భవతి ఇతి సన్తః కథయన్తి। మాతృపితృసంయోగేన ప్రాప్తమిదం నరస్య దేహం భక్తి-జ్ఞాన-కర్మ-యోగాదిభిః మార్గైః ధర్మార్థకామమోక్ష-చతుర్విధపురుషార్థానాం సాధనాయ ఉపయుక్తం భవతి। మానవమేధా అతీవసఙ్క్లిష్టం వస్తు వర్తతే లోకే। తస్యాః కార్యాచరణవిధానం విశిష్టం, అసమానం చ।
పుణ్యకర్మాచరణేన శరీరే అదృష్టా శక్తిః వర్ధతే। యోగినః ప్రాణాయామ-ధ్యానాదికర్మభిః పరిపుష్య కాయస్యాస్య ఉత్కృష్టతమామ్ ఉపయోగితాస్థితిం సాధయన్తి। తయా స్థిత్యా తే లోకస్యోపకారం కుర్వన్తి। మద్యపానాదిసేవనేన కేచన మన్దబుద్ధయః మహోత్కృష్టస్యాస్య ధర్మపరికరస్య దురుపయోగం కుర్వన్తి। తైః దుష్టాచరణైః, పాపాచరణైశ్చ అస్య దేహస్య శక్తిః క్రమేణ క్షీణా భవతి॥
-సంకా ఉషారాణి
----------------------------------------
ప్రస్తావవిషయం -- మానవశరీరం
మనుష్యడు భూమిపైన సృష్టిలో సమస్తప్రాణులలో విశిష్టమైన వాడు.అతడు అనేక అంశాలలో ఇతర ప్రాణులకన్నా ప్రత్యేకంగా ఉంటాడు.అతని శరీరనిర్మాణమే దానికి ప్రధానకారణం. మానవశరీరం స్థూలసూక్ష్మకారణ భేదాలతో మూడు విధములు. స్థూలశరీరం శిరస్సు-నేత్రాలు-కరచరణాది అవయవాలతో కూడి కన్నులకు కనుపిస్తూ ఉంటుంది. దానిని తాకవచ్చుకూడా.దాని పోషణ అన్నము, నీరు, పాలు, ఫలాహారాదులతో జరుగుతుంది. కానీ సూక్ష్మ,కారణ శరీరాలు అలాకాదు.సూక్ష్మశరీరం అంటే, పఞ్చకర్మేన్ద్రియాలు, పఞ్చజ్ఞానేన్ద్రియాలు, మనోబుద్ధులు మొదలైన అన్తఃకరణ చతుష్టయాలతో కూడిన రూపము. మనసుకు పోషణ ధ్యానాదులతో కలుగుతుంది అని ఋషులంటారు. మాతృపితృసంయోగం వలన ప్రాప్తించిన ఈమానవ దేహం భక్తి-జ్ఞాన-కర్మ-యోగాది మార్గాలతో ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధపురుషార్థాలను సాధించడానికి ఉపయోగపడుతుంది.మానవమేధ లోకంలో చాలా క్లిష్టమైనది. దాని కార్యాచరణవిధానం విశిష్టమూ, అసమానమూ కూడా.
పుణ్యకర్మాచరణం వలన శరీరంలో కానరాని శక్తి పెరుగుతుంది.యోగులు ప్రాణాయామ-ధ్యానాదికర్మలతో పరిపుష్టమైన శరీరాన్ని ఉత్కృష్టంగా ఉపయోగించే స్థితిని సాధిస్తారు.ఆ స్థితి వలన లోకోపకారం చేస్తారు. మద్యపానాదులను సేవించడం వల్ల కొందరు మందబుద్ధులు మహోత్కృష్టమైన ధర్మ పరికరాన్ని దురుపయోగం చేస్తారు. వారి దుష్టాచరణము, పాపాచరణముల వలన వారి శరీరంలో శక్తి క్రమేణ క్షీణిస్తుంది.
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
వివిధ విషయాలపై చిన్న-పెద్ద సంస్కృతలేఖలు, తెలుగు అనువాదాలతో- భాష నేర్చుకునే ఉద్దేశ్యంతో.
Sunday, September 5, 2021
ప్రస్తావ పారిజాతం- 12 విషయం -- మానవశరీరం
Subscribe to:
Post Comments (Atom)
ప్రస్తావ పారిజాతం-20 విషయం -- చంద్రుడు
🎀 *ప్రస్తావ-పారిజాతః-20* 🎁 *ప్రస్తావ పారిజాతం-20 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)* -------------------------- 🌷 సంస్కృతరచన- సంకా ఉషారాణి తెల...
-
🎀 *ప్రస్తావ-పారిజాతః-20* 🎁 *ప్రస్తావ పారిజాతం-20 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)* -------------------------- 🌷 సంస్కృతరచన- సంకా ఉషారాణి తెల...
-
🎀 ప్రస్తావ-పారిజాతః-19 🎁 ప్రస్తావ పారిజాతం-19 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం) -------------------------- 🌷 రచన- సంస్కృతం -సంకా ఉషారాణి తెలు...
-
🎀 *ప్రస్తావ-పారిజాతః- 14* 🎁 *ప్రస్తావ పారిజాతం- 14 (సంస్కృతలేఖ - తెలుగు అనువాదం)* -------------------------- 🌷 సంస్కృతరచన- సంకా ఉషారాణి త...
No comments:
Post a Comment